Sakshi News home page

ఆస్పత్రిలో నర్సింగ్‌ సిబ్బందిపై దౌర్జన్యం

Published Sat, Apr 1 2023 1:40 AM

-

మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో నర్సింగ్‌, సెక్యూరిటీ సిబ్బందిపై దౌర్జన్యం చేసి, ప్రైవేటు అంబులెన్స్‌ అద్దాలు పగలగొట్టి వీరంగం సృష్టించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు టూటౌన్‌ ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు. గురువారం రాత్రి పట్టణంలోని గాంధీపురానికి చెందిన మస్తాన్‌సాబ్‌ కుమారుడు దావూద్‌(21) ద్విచక్రవాహన ప్రమాదంలో గాయపడి ఆస్పత్రికి రాగా అతనితోపాటు గాంఽధీపురానికి చెందిన కాలేషా కుమారుడు మహమ్మద్‌ఘనీ(25) ధన (23) త్వరగా చికిత్సలు చేయలేదని నర్సింగ్‌ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు వచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై దౌర్జన్యం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు వచ్చిన ప్రైవేటు అంబులెన్స్‌ ఆపరేటర్లతో గొడవకు దిగి, ప్రైవేటు అంబులెన్స్‌ వాహన అద్దాలను పగలగొట్టి వీరంగం సృష్టించారు. వారి ముగ్గురిపై ప్రైవేటు అంబులెన్స్‌ ఆపరేటర్‌ రఘ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ముగ్గురిపై కేసు నమోదు

Advertisement

తప్పక చదవండి

Advertisement