క్రీడల్లో రాణించాలి | Sakshi
Sakshi News home page

క్రీడల్లో రాణించాలి

Published Fri, Nov 10 2023 5:30 AM

మాట్లాడుతున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి  - Sakshi

కురబలకోట : క్రీడల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. అంగళ్లులోని విశ్వం కళాశాలలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే 67వ రాష్ట్ర స్థాయి బాస్కెట్‌ బాల్‌ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. క్రీడాకారులు మార్చ్‌ నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర స్థాయి పోటీలు నియోజకవర్గంలో నిర్వహించడం హర్షణీయమన్నారు. ప్రతి క్రీడాకారుడు గెలుపే లక్ష్యంగా ఆడాలన్నారు. ఏ ఆటలోనైనా గెలుపోటములు సహజమన్నారు. ఓటమి ఎదురైతే దాని నుంచే గెలుపు పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. ప్రతిభ చూపిన వారికి ఉన్నత విద్య, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు. సీఎం జగన్‌ క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. విశ్వం విద్యా సంస్థల అధినేత ఎం.ప్రభాకర్‌రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.దస్తగిరి, సర్పంచ్‌ పోరెడ్డి విశ్వారెడ్డి, మండల కన్వీనర్‌ కోళ్ల వాసుదేవరెడ్డి, సురేంద్రరెడ్డి, సాయికుమార్‌రెడ్డి, వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు ప్రారంభం

ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement