న్యాయ సేవలను వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

న్యాయ సేవలను వినియోగించుకోవాలి

Published Fri, Nov 10 2023 5:36 AM

న్యాయ సేవా దినోత్సవ ర్యాలీలో న్యాయమూర్తులు  - Sakshi

మదనపల్లె: బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలదించేందుకు లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ యాక్ట్‌ తీసుకు వచ్చినట్లు రెండో అదనపు జిల్లా జడ్జి బి.అబ్రహాం అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కోర్డు ఆవరణలో న్యాయవాదులతో కలిసి ఆయన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి డి.వెంకటేశ్వర్లు నాయక్‌, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శిరీష్‌, ఒకటో అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జీ.సి.ఆసిఫా సుల్తానా, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement