ప్రమాదవశాత్తు వ్యక్తికి గాయాలు | Sakshi
Sakshi News home page

ప్రమాదవశాత్తు వ్యక్తికి గాయాలు

Published Sun, Dec 24 2023 1:20 AM

-

మదనపల్లె : వెల్డింగ్‌షాపులో పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గాయపడిన సంఘటన శనివారం బసినికొండలో జరిగింది. పట్టణంలోని మోతీనగర్‌కు చెందిన సయ్యద్‌బాషా కుమారుడు సమీర్‌(28) బసినికొండ వద్ద ఉన్న ఆదిల్‌ వెల్డింగ్‌షాపులో పనిచేస్తున్నాడు. శనివారం ఓ ట్రాక్టర్‌ రిపేరి నిమిత్తం రాగా, నిలిపి ఉంచిన ట్రాక్టర్‌కు మరమ్మతులు చేస్తున్నారు. అదేసమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ ముందుకు కదులుతూ, సమీర్‌ కాలుపైకి ఎక్కింది. ప్రమాదంలో సమీర్‌ గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకుంటున్నాడు.

Advertisement
Advertisement