జే.పంగులూరు: జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో కొండమంజులూరు విద్యార్థి భవ్యశ్రీ ప్రథమ స్థానం సాధించింది. ఖాదీ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు బాపట్ల ఏబీఎం ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి అనే మంది విద్యార్థులు హాజరయ్యారు. భవ్యశ్రీకి జిల్లా సైన్స్ అధికారి సాధిక్ ప్రశంస పత్రం, రూ.5 వేల నగదు బహుమతి అందించారు. ఈసందర్భంగా విద్యార్థినిని హెచ్ఎం ఐ.అనిత, ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ వెంకట్రావు, నాయకులు జంపాని రవిబాబు తదితరులు అభినందించారు.
కబడ్డీ, క్రికెట్ పోటీలకు శంఖవరప్పాడు విద్యార్థులు..
అద్దంకి: అండర్–17 జిల్లాస్థాయి క్రికెట్ పోటీలకు మండలంలోని శంఖవరప్పాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి తేజశ్వాంత్, అదే విధంగా అండర్–14 కబడ్డీలో జట్టుకు బి.చంద్రశేఖర్రెడ్డి ఎంపికయ్యారు. వారిరువురినీ హెచ్ఎం సాయి నాగభూషమ్మ, పీడీ ప్రభాకర్రావు అభినందించారు.