ట్రాక్టర్‌ బోల్తా కొట్టి డ్రైవర్‌ మృతి | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా కొట్టి డ్రైవర్‌ మృతి

Published Wed, Nov 22 2023 1:54 AM

 రవికుమార్‌
మృతదేహం  - Sakshi

బల్లికురవ: పొలం దున్నేందుకు ట్రాక్టర్‌ కాలువకట్టపై వెళ్తుండగా మలుపులో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో డ్రైవర్‌ అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని అద్దంకి బ్రాంచి కాలువ నుంచి గుంటుపల్లి మేజర్‌ కాలువ కట్టపై చోటుచేసుకుంది. వివరాలు.. కొమ్మినేనివారిపాలేనికి చెందిన మొరసా పూర్ణచంద్రరావు పొలాన్ని దున్నేందుకు డ్రైవర్‌ ఉప్పుతాళ్ల రవి కుమార్‌(36) గ్రామం నుంచి బయలుదేరి వెళ్లిన అరగంటకే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకుని ట్రాక్టర్‌ యజమాని గ్రామస్తులు వచ్చి ట్రాక్టర్‌ కిందపడిన రవికమార్‌ను తీసి ట్రాక్టర్‌ను లేపారు. అప్పటికే డ్రైవర్‌ రవికుమార్‌ చనిపోయాడు. ఘటనా స్థలాన్ని ఏఎస్‌ఐ సీ బాలకృష్ణ పరిశీలించారు. మృతుడికి భార్య రమాదేవి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు.

Advertisement
Advertisement