పథకం ప్రకారమే టీడీపీ రౌడీ మూకల దాడి | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే టీడీపీ రౌడీ మూకల దాడి

Published Tue, Jan 30 2024 1:28 AM

-

సత్తెనపల్లి: ముప్పాళ్ల మండలం తొండపిలో వైఎస్సార్‌ సీపీకి చెందిన ముస్లిం సోదరులపై టీడీపీ రౌడీ మూకలు పథకం ప్రకారం దాడి చేశాయని వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల నుంచి చూశామని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్నా లక్ష్మీనారాయణ 20 కార్లతో ర్యాలీగా వెళ్లారని, ఆ కారుల్లో కర్రలు, కత్తులు, రాళ్లు తీసుకొని వెళ్లారన్నారు. తొండపి గ్రామంలో కొంత మంది టీడీపీ రౌడీ మూకలతో కలిసి బజారులో రాళ్లు విసురుకుంటూ వెళ్లారన్నారు. మీటింగు జరిగే ప్రదేశం వేరని, గొడవ జరిగిన ప్రదేశం వేరన్నారు. అక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరుల బజారుకు వెళ్లి మీరంతా వైఎస్సార్‌ సీపీకి సపోర్టు చేయడమేమిటి అంటూ రాళ్లు విసిరారన్నారు. ఈ క్రమంలో జరిగిన దాడిలో వైఎస్సార్‌ సీపీకి చెందిన ఇరువురు కార్యకర్తలకు గాయాలై సత్తెనపల్లి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారన్నారు. ఈ విధమైన భౌతిక దాడులకు దిగడం దురదృష్టకరమన్నారు. ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏమిటో ఓటు ద్వారా చూసుకోవాలని తెలిపారు.

Advertisement
Advertisement