మరింత గొప్ప పాలనకు ఈ ఉగాది నాంది | Sakshi
Sakshi News home page

మరింత గొప్ప పాలనకు ఈ ఉగాది నాంది

Published Wed, Apr 10 2024 1:35 AM

పూజలు చేస్తున్న మంత్రి విడదల రజిని - Sakshi

నెహ్రూనగర్‌: ఈ ఉగాది మరింత గొప్ప పాలనకు నాంది పలకబోతోందని, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజారిటీ సాధించి ఆంధ్రప్రదేశ్‌లో మరో గొప్ప సంచలన పాలన నమోదు కాబోతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి విడదల రజిని అన్నారు. గుంటూరు చంద్రమౌళి నగర్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. ఆమె స్వయంగా అందరికీ ఉగాది పచ్చడి పంచి పెట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ ఈ ఉగాది పండుగ పేదల గొప్ప భవిష్యత్‌కు పునాది కానున్నదని చెప్పారు. ఉగాది పండుగ షడ్రుచుల సమ్మేళనం అయితే.. జగనన్న పాలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, అగ్రవర్ణ పేదలు.. వర్గాల సమ్మేళనం అని పేర్కొన్నారు. వీరందరికీ గొప్ప సంక్షేమం మళ్లీ అందాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ఇది క్రోధి నామ సంవత్సరం అని, పేదలంతా తమకు వ్యతిరేకంగా పెత్తందారుల కొమ్ము కాస్తున్న రాజకీయ పార్టీలపై ఆగ్రహం ప్రకటించబోతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పెత్తందారుల పార్టీలను ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించబోతున్నారని వెల్లడించారు. పేదలు, మహిళల అండతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ విజయం సాధించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి

గడిచిన అయిదేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌న్‌మోహన్‌రెడ్డి చేపట్టిన చర్యలు రానున్న అయిదేళ్లలో సత్ఫలితాలు ఇస్తాయని, రాష్ట్రంలో నాలుగు పోర్టుల నిర్మాణం పూర్తయి నౌకా వాణిజ్యం ప్రారంభమై గణనీయమైన అభివృద్ధి జరుగుతుందని మంత్రి రజిని వివరించారు.

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ

మంత్రి విడదల రజిని

Advertisement
Advertisement