పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు | Sakshi
Sakshi News home page

పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు

Published Sat, Nov 11 2023 12:10 AM

టేకులపల్లి ‘ఏ’ కాలనీ తండాలోని పాఠశాలకు తాళం వేస్తున్న తల్లిదండ్రులు  - Sakshi

టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పంచాయతీ ‘ఏ’ కాలనీ తండా ప్రాథమిక పాఠశాలలో రెండేళ్లు విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయుడు భూక్యా శంకర్‌ను ఇటీవల డిప్యూటేషన్‌పై ఇంకో పాఠశాలకు కేటాయించారు. అయితే, తమ పిల్లలను తీర్చిదిద్దిన శంకర్‌ మళ్లీ వస్తేనే విద్యార్థులను బడికి పంపిస్తామని, అప్పటివరకు పాఠశాల తాళం కూడా తీయనిచ్చేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. పాఠశాలలో 14 మంది విద్యార్థులు ఉండగా, శంకర్‌ డిప్యూటేషన్‌ను రద్దు చేయాల్సిందేనంటూ తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాలకు తాళం వేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌, తల్లిదండ్రులు బానోతు క్రాంతికుమార్‌, అజ్మీరా రవికుమార్‌, ధరావత్‌ వీరు, బాబూరావు, మహేశ్‌, గుగులోత్‌ కృష్ణ, బోడ ఉమ, లాలు, రమేశ్‌, చిన్నా మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లోనే శంకర్‌ను డిప్యూటేషన్‌పై పంపిస్తే తాము ఉన్నతాధికారులకు విన్నవించడంతో ఇక్కడే కొనసాగిస్తామని తెలిపారు. కానీ, మూడు రోజుల కిందట రిలీవ్‌ చేశారని పేర్కొన్నారు. దీంతో వారు తాళం వేయగా, విధులు నిర్వర్తించేందుకు వచ్చిన ఉపాధ్యాయురాలు రామకోటేశ్వరి సమయం ముగిసే వరకు బయటే కూర్చుని వెళ్లిపోయారు.

డిప్యూటేషన్‌పై వెళ్లిన సార్‌ వస్తేనే

పిల్లలను పంపిస్తామని వెల్లడి

Advertisement
Advertisement