ఇదీ మా మేనిఫెస్టో! | Sakshi
Sakshi News home page

ఇదీ మా మేనిఫెస్టో!

Published Sat, Nov 11 2023 12:10 AM

గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద కరపత్రంతో సురేందర్‌రెడ్డి  - Sakshi

కారేపల్లి: సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వారి పార్టీల మేనిఫెస్టో ఆధారంగా ప్రచారం చేయడం ఆనవాయితీ. అయితే, సింగరేణి (కారేపల్లి) గ్రామ ప్రజల తరఫున సామాజిక కార్యకర్త సురేందర్‌రెడ్డి గ్రామంలోని సమస్యలు, చేయాల్సిన అభివృద్ధి పనులు వైరా నియోజకవర్గ అభ్యర్థులకు తెలిసేలా కరపత్రాలు ముద్రించాడు. వీటిని ప్రజలకు అందజేస్తూ ప్రచారానికి వచ్చే నాయకులకు సమస్యలను వివరించాలని కోరుతున్నారు. బొగ్గుగనుల పుట్టినిల్లయిన సింగరేణి(కారేపల్లి) గ్రామాభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధులు కేటాయించాలని, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా మార్చాలని, కారేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, 60 ఏళ్ల చరిత్ర ఉన్న కారేపల్లి సంతను అభివృద్ధి చేయాలనే తదితర డిమాండ్లను ఆయన కరపత్రంలో ముద్రించాడు.

అభ్యర్థులకు సమస్యలను

తెలిపేలా కరపత్రాలు

Advertisement
Advertisement