బీటీపీఎస్ నుంచి వెలువడె వ్యర్థాలతో కలుషితం అవుతున్న నీరు తాగి, గాలి పీల్చి వ్యాధులతో అవస్థ పడుతున్నాం. నెలకు రెండుసార్లు ఇంట్లో అందరూ జ్వరాల బారిన పడుతున్నాం. అయినా మమ్ముల్నిపట్టించుకునే నాథులే లేరు. మురుగునీరు తాగలేక ప్లాంట్ల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
–కనకమ్మ, చిక్కుడుగుంట గ్రామస్తురాలు
పంటల దిగుబడి పోయింది..
మా భూములు తీసుకునే సమయంలో ఉపాధి, విద్య, వైద్యంపై ఇచ్చిన హామీల అమలు ఊసేలేదు. బీటీపీఎస్, సింగరేణి ప్రభావిత ప్రాంతమైన విప్పలసింగారంలోని కోల్ వాషరీ ప్లాంట్ నీరు పొలాల్లోకి వస్తోంది. దీంతో దిగుబడి పోయిందని చెప్పినా పట్టించుకోవట్లేదు.
–సోడె రవి, విప్పలసింగారం గ్రామస్థుడు
●