సీఎస్ఆర్ నిధులను బీటీపీఎస్, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కాకుండా ఇతర చోట్ల వెచ్చిస్తున్నారు. స్థానిక ఎమ్మె ల్యేల సిఫారసుతో ఇలా చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఇకనైనా పాలకులు సీఎస్ఆర్ నిధులు ప్రభావిత గ్రామాల్లోనే వినియోగించి సదుపాయాల కల్పన, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
–మధుసూదన్రెడ్డి, ఎన్డీ నాయకుడు
మా గ్రామాలకు నిధులు లేవు
2018లో రూ.90 లక్షలు సీఎస్ఆర్ ఫండ్ సింగరేణి ఇచ్చింది. ఆ తర్వాత రూపాయి రాలేదు. పగిడేరు బీటీపీఎస్, సింగరేణికి ప్రభావిత గ్రామమైనా పట్టించుకోవడం లేదు. కలెక్టర్, అదనపు కలెక్టర్, సింగరేణి అధికారులకు వినతిపత్రాలు ఇస్తే ప్రతిపాదనలతో సరిపెడుతున్నారు.