ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం

Published Mon, Dec 4 2023 1:00 AM

-

పాల్వంచ : జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రియాంక ఆల తెలిపారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ సహకారాలు మరువలేనివని పేర్కొన్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో భాగస్వామ్యం వహించిన అధికారులు, అనధికారులు, ప్రజలు, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు.

కౌంటింగ్‌ కేంద్రం పర్యవేక్షణ

పాల్వంచలోని అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను ప్రియాంక ఆల పర్యవేక్షించారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు వచ్చినా వెంటనే సరిదిద్దాలని సిబ్బందిని ఆదేశించారు. పలుమార్లు ఆన్‌లైన్‌ సమస్యలు ఏర్పడగా బాధ్యులతో మాట్లాడి పరిష్కరించారు. ఆమె వెంట రిటర్నింగ్‌ అధికారులు ప్రతీక్‌ జైన్‌, రాంబాబు, మంగీలాల్‌, శిరీష, కార్తీక్‌, డీఆర్‌డీఓ మధుసూదన్‌ రాజు, పరిశీలకులు కమల్‌ కిశోర్‌, హరికిశోర్‌, వివేక్‌ కుమార్‌, గణేశ్‌, కంటి శేఖర్‌ సింగ్‌ ఉన్నారు.

Advertisement
Advertisement