ఇటీవల కురిసిన వర్షాలకు మండలంలోని నెల్లిపాకలో ఉన్న శ్రీరామ కాటన్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లులో నిల్వ ఉంచిన పత్తి తడిసిపోయింది. దీంతో కొనుగోలు చేసి నిల్వ ఉంచిన మిల్లు వ్యాపారులకు రూ. కోటి మేర నష్టం వాటిల్లింది. ఇటీవల రైతుల వద్ద వ్యాపారులు 2,350 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేయగా, 1,500 క్వింటాళ్ల పత్తి తడిసింది. వర్షంతో పత్తి తడిసి భారీగా నష్టపోయినట్లు వ్యాపారులు తెలిపారు.