మన దేశ సంస్కృతిలో బంగారం ఒక కీలకమైన వస్తువు. వివాహాది శుభ కార్యాల్లో కచ్చితంగా బంగారం ఉండాల్సిందే. మహిళలకు ఐతే మరీనూ.. బంగారం అంటే అమితమైన ప్రేమ. బంగారంపై భారతీయులకు ఉన్న మక్కువ గత ఏప్రిల్ , మే నెలలో జరిగిన బంగారం దిగుమతులే నిదర్శనం. ఓ వైపు కరోనా మహమ్మారితో సావాసం చేస్తోన్న బంగారం కొనుగోలు తగ్గడం లేదు. ఏప్రిల్, మే నెలలో సుమారు రూ. 51, 439 కోట్ల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది.
బంగారం నుంచి క్రిప్టోకరెన్సీ వైపు..
ప్రస్తుతం భారత ప్రజలు బంగారంపైనే కాకుండా క్రిప్టోకరెన్సీపై కూడా కన్నేశారు. భారత్లో సుమారు 25 వేల టన్నుల బంగారాన్ని కలిగి ఉంది. అంతే దూకుడుతో భారతీయులు క్రిప్టోకరెన్సీపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్కాయిన్, డాగ్కాయిన్, ఈథర్ క్రిప్టోకరెన్సీలపై విచ్చలవిడిగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి.
క్రిప్టోకరెన్సీపై పరిశోధనలు చేస్తోన్న ప్రముఖ సంస్థ చైనాలిసిస్ ప్రకారం భారత్లో గత సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు 200 మిలియన్ డాలర్ల నుంచి దాదాపు 40 బిలియన్ డాలర్లుకు పెరిగిందని పేర్కొంది. ఇది రిజర్వ్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీ పెట్టుబడులపై నిషేధం విధించిన కూడా భారీ ఎత్తులో భారతీయులు క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.
నేలచూపులు చూస్తోన్నా..తగ్గేది లేదు..!
క్రిప్టోకరెన్సీ గత కొన్ని నెలలుగా నేలచూపులు చూస్తున్న.. భారతీయులు డిజిటల్ కరెన్సీపై ఇన్వెస్ట్చేయడానికి మాత్రం జంకడం లేదు. బంగారంపై కాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్ చేయడానికి భారతీయులు ముందుంటున్నారు. అంతేకాకుండా క్రిప్టో కరెన్సీపై ఇన్వెస్ట్మెంట్ అత్యంత పారదర్శకంగా ఉంటుందని నమ్ముతున్నారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ లాభాలను గడించవచ్చునని భావిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయ కరెన్సీ ఆయా దేశాల్లోని సెంట్రల్ బ్యాంకుల నియంత్రిస్తాయి. కానీ క్రిప్టోకరెన్సీ విషయంలో అలా జరగదు. దాని నియంత్రణ పూర్తిగా కొనుగోలు, అమ్మకాలు జరిపే వారి చేతుల్లోనే ఉంటుంది. దీంతో భారతీయులు ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం భారత్లో ఎక్కువగా 18 నుంచి 35 సంవత్సరాల వయసు గల యువతి, యువకులే ఎక్కువగా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని చైనాలసిస్ పేర్కొంది. భారత్లో ప్రస్తుతం 19 క్రిప్టో ఎక్స్చేంజ్ మార్కెట్లు ఉన్నాయి.
క్రిప్టోకరెన్సీ పై భారీగా ఇన్వెస్ట్ చేస్తోన్న భారతీయులు..!
Published Mon, Jun 28 2021 11:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement