న్యూఢిల్లీ: దేశీ ఎడ్ టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫాం ఎపిక్ సంస్థను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,730 కోట్లు). అమెరికాలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ఎపిక్ కొనుగోలు తోడ్పడగలదని బైజూస్ వ్యవస్థాపకుడు, సీఈవో బైజు రవీంద్రన్ తెలిపారు. ఉత్తర అమెరికా మార్కెట్పై అదనంగా 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 7,460 కోట్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఈ సందర్భంగా రవీంద్రన్ వివరించారు. ఎపిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో సురేన్ మార్కోసియన్తో పాటు మరో సహ వ్యవస్థాపకుడు కెవిన్ డోనాహ్యూ ఇకపైనా అదే హోదాల్లో కొనసాగుతారని పేర్కొన్నారు.
‘నేర్చుకోవడంపై పిల్లల్లో ఆసక్తి కలిగించాలన్నది మా లక్ష్యం. ఎపిక్, దాని ఉత్పత్తులు కూడా ఇదే లక్ష్యంతో రూపొందినవి. అందుకే ఈ కొనుగోలు ఇరు సంస్థలకు ప్రయోజనకరంగా ఉండగలదు‘ అని ఆయన తెలిపారు. తమ లక్ష్యాల సాధానకు బైజూస్తో భాగస్వామ్యం తోడ్పడగలదని మార్కోసియన్ ధీమా వ్యక్తం చేశారు. ఎపిక్ ప్లాట్ఫాంలో 40,000 పైచిలుకు పుస్తకాలు, ఆడియోబుక్స్, వీడియోలు ఉన్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం ఇరవై లక్షల పైచిలుకు ఉపాధ్యాయులు, 5 కోట్ల దాకా యూజర్లు ఈ సంస్థకు ఉన్నారు. కరోనా వైరస్పరమైన పరిణామాలతో ఆన్లైన్ విద్యాభ్యాసం వైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితుల నేపథ్యంలో ఎడ్టెక్ రంగ సంస్థలకు గణనీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది.
జోరుగా కొనుగోళ్లు..
2015లో ప్రారంభమైన బైజూస్ సర్వీసులను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది పైచిలుకు విద్యార్థులు వినియోగించుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పలు సంస్థలను బైజూస్ వరుసగా కొనుగోలు చేస్తోంది. 2017లో ట్యూటర్విస్టా, ఎడ్యురైట్ను.. 2019లో ఓస్మోను దక్కించుకుంది. గతేడాది కోడింగ్ ట్రైనింగ్ ప్లాట్ఫాం వైట్హ్యాట్ జూనియర్ను 300 మిలియన్ డాలర్లకు చేజిక్కించుకుంది. ఇక ఏడాది ఏప్రిల్లో ఏకంగా 1 బిలియన్ డాలర్లు వెచ్చించి ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను (ఏఈఎస్ఎల్) కొనుగోలు చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి బైజూస్ దాదాపు 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. జనరల్ అట్లాంటిక్, టైగర్ గ్లోబల్, సెకోయా క్యాపిటల్, నాస్పర్స్, చాన్–జకర్బర్గ్ ఇనీషియేటివ్, సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ సంస్థలు ఇందులో ఇన్వెస్ట్ చేశాయి.
బైజూస్ విదేశీ షాపింగ్
Published Thu, Jul 22 2021 3:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
కళతప్పిన జీవనదులు
ఒక్కో నియోజకవర్గంలో 20 వేలపైనే..
ఢిల్లీ రేసులోకొచ్చింది!
గుట్టలుగా... అవినీతి కట్టలు
వేలంలో మారడోనా గోల్డెన్ బాల్ ట్రోఫీ
ఎన్నికల విధులు సక్రమంగా నిర్వర్తించాలి
రైతులను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
చెంచులతో మమేకమై.. ఓటు విలువ తెలిపి
జిల్లాకేంద్రంలో గాలి దుమారం
తప్పక చదవండి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement