ముంబై : ఒమిక్రాన్ భయాలు వెంటారుడుతున్నా అంతర్జాతీయ మార్కెట్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. వాటి ప్రభావం దేశీ మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. నూతన సంవత్సరంలో మొదటి స్టాక్ మార్కెట్ సెషన్ లాభాలతో మొదలైంది. రెండు మార్కెట్లలోనూ లార్జ్ క్యాప్ షేర్లలో ర్యాలీ కనిపిస్తోంది. మిడ్ క్యాప్ షేర్లు సైతం లార్జ్ క్యాప్ బాటలోనే ఉన్నాయి.
ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 345 పాయింట్లు లాభపడి 58,598 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ 108 పాయింట్లు లాభపడి 17,462 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. టాటా మోటార్స్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, ఐషర్ ట్రాక్టర్స్ లాభాల్లో ఉండగా ఫ్లిప్సైడ్, హిందాల్కో, ఓఎన్జీసీ, ఆల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సుమర్ ప్రొడక్ట్ షేర్లు నష్టపోయాయి.