బేర్‌ పట్టులో స్టాక్‌ మార్కెట్‌.. నష్టాలతో మొదలు | Sakshi
Sakshi News home page

బేర్‌ పట్టులో స్టాక్‌ మార్కెట్‌.. నష్టాలతో మొదలు

Published Wed, Dec 15 2021 10:04 AM

Daily Stock Market Updats In Telugu December 15 - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పట్టుకొనసాగుతుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌ సూచీలతో సంబంధం లేకుండా మార్కెట్‌ నష్టాలతో మొదలైంది.  ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే మొగ్గు చూపుతున్న తరుణంలో జీడీపీ వృద్దిరేటుని సవరిస్తూ ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు కీలక ప్రకటన చేసింది. దీంతో బుధవారం మార్నింగ్‌ సెషన్‌ నష్టాలతో మొదలైంది. 

ఈరోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 58,122 పాయింట్ల దగ్గర ప్రారంభమైంది. ఆ వెంటనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో వరుసగా పాయింట్లు కోల్పోయింది. ఓ దశలో 57,853 పాయింట్లకు పడిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో 236 పాయింట్లు నష్టపోయి 57,880 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 52 పాయింట్లు నష్టపోయి 17,272 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. 
 

Advertisement
Advertisement