కేంద్రం వడ్డీ రేట్లు పెంచింది.. చెక్ చేసుకున్నారా?
Published
Sat, Sep 30 2023 7:16 AM
న్యూఢిల్లీ: ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ పథకంపై వడ్డీ రేటును కేంద్రం శుక్రవారం 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. అన్ని ఇతర చిన్న పొదుపు పథకాల రేట్లను యథాతథంగా ఉంచింది.
డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి తాజా రేట్ల విధానంపై ఆర్థికశాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. డిసెంబర్ త్రైమాసికానికి యథాతథంగా కొనసాగుతున్న మిగిలిన పొదుపు పథకాల రేట్లు ఇలా...