జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్‌ కైవసం.. డీల్‌ విలువ ఎంతంటే? | Sakshi
Sakshi News home page

జర్మనీకి చెందిన అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్‌ కైవసం.. డీల్‌ విలువ ఎంతంటే..?

Published Tue, Mar 22 2022 6:15 PM

Infosys Acquires Germany-Based Digital Marketing Agency Oddity - Sakshi

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ దూకుడును పెంచింది. జర్మనీకి చెందిన డిజిటల్‌ మార్కెటింగ్‌, కమర్షియల్‌ ఎజెన్సీ ఆడీటీ(oddity)ను కైవసం చేసుకుంటున్నట్లు ఇన్ఫోసిస్‌ మంగళవారం రోజున ఒక ప్రకటించింది. ఈ ఒప్పందంపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి.  

ఆడీటీ కొనుగోలుతో సృజనాత్మక, బ్రాండింగ్, అనుభవ రూపకల్పన వంటి సామర్థ్యాలను బలోపేతం చేస్తోందని ఇన్ఫోసిస్ అభిప్రాయపడింది. ఆడీటీను కైవసం చేసుకునే ప్రక్రియ 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ముగుస్తోందని ఇన్ఫోసిస్‌ పేర్కొంది. ఈ కంపెనీతో పాటుగా ఏకకాలంలో క్రిస్టాల్‌ 247ను కూడా ఇన్ఫోసిస్‌ హస్తగతం చేసుకొనుంది. ఆడీటీను సొంతం చేసుకునేందుకు ఇన్ఫోసిస్‌ సుమారు 50 మిలియన్‌ యూరోల(సుమారు రూ. 419 కోట్లు)ను ఖర్చు చేసింది. ఇక​ క్రిస్టాల్‌ 247ను కేవలం 3000 యూరోల(సుమారు రెండున్నర లక్షల రూపాయల)ను ఖర్చు చేయనుంది.

జర్మనీలో అతి పెద్ద సంస్థగా..!
జర్మనీలో డిజిటల్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీల్లో ఆడీటీ అతి పెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ కంపెనీ స్టుట్‌గార్ట్, బెర్లిన్, కొలోన్, బెల్‌గ్రేడ్, షాంఘై, తైపీ వంటి నగరాల్లో 300పైగా డిజిటల్‌ మార్కెటింగ్‌ నిపుణులను కలిగి ఉంది. జర్మన్ ఓమ్నీ-ఛానల్, ఈ-కామర్స్ రిటైలర్‌లు, ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లు, గ్లోబల్ మొబిలిటీ ప్రొవైడర్ల కోసం డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేయడం వంటి సర్వీసులను ఆడిటీ అందిస్తోంది. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ మేనేజ్‌మెంట్ అండ్‌ కమ్యూనికేషన్, వర్చువల్ అండ్‌ ఆగ్మెంటెడ్ రియాలిటీ, అనుభవంతో సహా అంతర్గత ఉత్పత్తితో కూడిన సమగ్ర సేవా పోర్ట్‌ఫోలియోను ఆడీటీ కల్గి ఉంది.

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోంపై ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!

Advertisement
Advertisement