Mothersday 2023: మాతృమూర్తుల కోసం 24/7 బడ్డీ ప్రోగ్రాం
Published
Sat, May 13 2023 3:20 PM
హైదరాబాద్: మెటర్నిటీ లీవులో ఉన్న ఉద్యోగినుల కోసం మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక బడ్డీ ప్రోగ్రామ్ను ఆవిష్కరించినట్లు 24/7 డాట్ఏఐ వెల్లడించింది. ఉద్యోగ విధులకు దూరంగా ఉన్నప్పటికీ సంస్థలో చోటుచేసుకునే పరిణామాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపింది.
ఇలా అప్డేట్గా ఉంచేందుకు సూపర్వైజర్ సూచించిన వారిని లేదా తమకు నచ్చిన వ్యక్తిని సదరు ఉద్యోగిని తమ బడ్డీగా (స్నేహితులు) ఎంచుకోవచ్చని పేర్కొంది. ఇప్పటికే బేబీ అలవెన్సులు, గిఫ్ట్ ఆఫ్ టైమ్, ప్రెగ్నెన్సీ సమయంలో ప్రత్యేక క్యాబ్లు తదితర సదుపాయాలను కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.