Sakshi News home page

ట్యుటికోరిన్‌ కోల్‌ బిడ్డింగ్‌పై జిందాల్‌ పవర్‌కు చుక్కెదురు

Published Thu, Jan 11 2024 5:47 AM

NCLAT rejects Jindal Power plea to allow bid for Tuticorin Coal Terminal - Sakshi

న్యూఢిల్లీ: ట్యుటికోరిన్‌ కోల్‌ టెర్మినల్‌ (టీసీటీ) బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్‌ పవర్‌ (జేపీఎల్‌) చేసిన విజ్ఞప్తిని నేషనల్‌ కంపెనీ లా అపీలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్‌కు అర్హత లేదంటూ ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది.

కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్‌ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్‌ సమర్పించిన బిడ్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్‌సీఎల్‌ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్‌ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది.

దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో  బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్‌ కోరింది. అయితే, బిడ్డింగ్‌కు అనుమతిస్తూనే.. సీఐఆర్‌పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్‌పీ కోరారు. దీంతో జేపీఎల్‌కు అర్హత ఉండదంటూ ఎన్‌సీఎల్‌టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీని జేపీఎల్‌ ఆశ్రయించింది.

Advertisement
Advertisement