టాటా కార్లు మరింత ప్రియం | Sakshi
Sakshi News home page

టాటా కార్లు మరింత ప్రియం

Published Sat, Apr 15 2023 4:44 AM

Tata Motors to hike prices of passenger vehicles from May 01 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వెహికిల్స్‌ కాస్త ప్రియం కానున్నాయి. మోడల్, వేరియంట్‌ను బట్టి ధర సగటున 0.6 శాతం పెరగనుంది. మే 1 నుంచి సవరించిన ధరలు అమలులోకి రానున్నాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది.

2023 ఫిబ్రవరి తర్వాత ధరలు పెంచడం ఇది రెండవసారి. నియంత్రణపర మార్పులు, ముడిసరుకు వ్యయం అధికం కావడం తాజా నిర్ణయానికి దారి తీసిందని టాటా మోటార్స్‌ తెలిపింది.  

Advertisement
Advertisement