Today Stock Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమై.. నష్టాలతోనే ముగిసాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 483.24 పాయింట్ల నష్టంతో 65512 పాయింట్ల వద్ద, నిఫ్టీ 156.70 పాయింట్ల నష్టంతో 19496.80 పాయింట్ల వద్ద ముగిసాయి.
టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హిందుస్తాన్ యూనిలీవర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ కంపెనీలు ఉన్నాయి. నష్టాల జాబితాలో అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఉన్నాయి.
రూపాయి: నేడు రూపాయి స్వల్ప నష్టంలో 83.26 వద్ద ముగిసింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)