సాక్షి మనీ మంత్రా: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాల పరంపర | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్రా: స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న లాభాల పరంపర

Published Fri, Sep 1 2023 9:33 AM

Today Stock market update 1st september 2023 money mantra - Sakshi

Today Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ప్రారంభం నుంచి లాభాలతో మొదలయ్యాయి. నేడు 9:20 గంటలకు సెన్సెక్స్ 111.28 పాయింట్ల లాభంతో 64855.51 వద్ద, నిఫ్టీ 38.65 పాయింట్ల లాభాలతో 19258.20 వద్ద  కొన సాగుతున్నాయి. 

లాభాలు పొందిన కంపెనీల జాబితాలో హిండాల్కో, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), టాటా స్టీల్,  JSW స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటివి ఉన్నాయి. అయితే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), ఆదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా  షేర్లు  నష్టపోతున్నాయి.  వరుసగా  రెండో రోజు కూడా అదానీ గ్రూప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది.

ఇదీ చదవండి: ఈ రోజు బంగారం & వెండి ధరలు

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement
Advertisement