Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

Published Thu, Nov 30 2023 9:20 AM

Today Stock Market Update 30 November 2023 By Money Mantra - Sakshi

నిన్న లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు ఉదయం కూడా లాభాలతోనే మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమయ్యే సమయానికి సెన్సెక్స్ 97.80 పాయింట్ల లాభంతో 66999.71 పాయింట్ల వద్ద, నిఫ్టీ 30.20 పాయింట్ల లాభంతో 20126.80 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా ఈ రోజు లాభాల్లో ముందుకు సాగుతున్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో ప్రధానంగా హీరో మోటోకార్ప్, అల్ట్రా టెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC), విప్రో, టాటా పవర్, హిందాల్కో, కంటైనర్ కార్పొరేషన్, అంబుజ సిమెంట్ వంటి సంస్థలు నష్టాల్లో సాగుతున్నాయి. 

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు)

Advertisement

What’s your opinion

Advertisement