న్యూఢిల్లీ: హెల్త్కేర్ చైన్ విజయా డయాగ్నొస్టిక్స్ పబ్లిక్ ఇష్యూ విజయవంతమైంది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 4.54 రెట్లు అధికంగా దరఖాస్తులు వచ్చాయి. షేరుకి రూ. 522–531 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 2.5 కోట్లకుపైగా షేర్లను విక్రయానికి ఉంచింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం 11.36 కోట్లకుపైగా షేర్ల కోసం బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ విభాగంలో 13 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 1.3 రెట్లు, రిటైలర్ల నుంచి 1.1 రెట్లు చొప్పున స్పందన లభించింది. ఇష్యూలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 566 కోట్లు సమీకరించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 1,895 కోట్లు సమకూర్చుకుంది. ఇక స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీ అమీ ఆర్గానిక్స్ ఐపీవోకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. ఇష్యూకి 64.5 రెట్లు అధిక స్పందన లభించింది. షేరుకి రూ. 603–610 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 65.4 లక్షల షేర్లను ఆఫర్ చేసింది. 42.22 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. క్విబ్ కోటా 87 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 155 రెట్లు, రిటైలర్ల నుంచి 13 రెట్లు అధిక దరఖాస్తులు వచ్చాయి.
విజయా డయాగ్నోస్టిక్స్ ఐపీవో ఓకే
Published Sat, Sep 4 2021 6:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement