Volvo Car India hikes prices of petrol mild-hybrid models - Sakshi
Sakshi News home page

వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!

Published Thu, Feb 23 2023 3:07 PM

Volvo Car hikes price  its petrol hybrid models - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ వోల్వో కార్‌ ఇండియా మైల్డ్‌ హైబ్రిడ్‌ మోడళ్లపై 2 శాతం వరకు ధర పెంచింది.   ఫలితంగా  మోడల్‌ని  బట్టి 50వేల రూపాయల నుంచి 2 లక్షల దాకా భారం పడనుంది.  ప్రభుత్వం కస్టమ్స్‌ డ్యూటీ సవరించిన నేపథ్యంలో పెరిగిన ముడిసరుకు వ్యయానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.

దీని ప్రకారం ఎక్స్‌సీ40, ఎక్స్‌సీ60, ఎస్‌90,ఎక్స్‌సీ90 వేరియంట్ల ధరలు అధికం కానున్నాయి. బెంగళూరు ప్లాంటులో ఈ మోడళ్లను కంపెనీ అసెంబుల్‌ చేస్తోంది. 

(ఇదీ చదవండిఆన్‌లైన్‌ షాపింగ్‌:లడ్డూ కావాలా నాయనా..కస్టమర్‌కి దిమ్మ తిరిగిందంతే!)

ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించిన విధంగా కస్టమ్స్ డ్యూటీలో మార్పుల ఫలితంగా తమ పెట్రోల్ మైల్డ్-హైబ్రిడ్ మోడళ్ల ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన ఫలితంగా  హైబ్రిడ్‌ల ధరలు స్వల్పంగా పెరిగాయని వోల్వో మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. యూనియన్ బడ్జెట్ 2023 ప్రకారం, సెమీ-నాక్డ్ డౌన్ (SKD) రూపంలో దిగుమతి చేసుకున్న వాహనాలపై కస్టమ్స్ సుంకం 30 శాతం నుండి 35 శాతానికి పెరిగింది. అయితే, అంతకుముందు విధించిన 3శాతం సాంఘిక సంక్షేమ సర్‌చార్జి (SWS) రద్దు అయింది.

Advertisement
Advertisement