ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో కీలక నిర్ణయం తీసుకుంది. జోమాటో త్వరలో ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కంపెనీ గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్లో జోమాటో ప్రారంభంలో 80 కి పైగా నగరాల్లో తొలిసారిగా కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించగా..దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో గ్రాసరీ డెలివరీ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం జోమాటో తిరిగి ఆన్లైన్ కిరాణా డెలివరీ సేవలను పునరుద్దరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
జోమాటో జూలై 14 నుంచి ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ) ప్రారంభించటానికి ముందే ఆన్లైన్ కిరాణా డెలివరీలో అడుగుపెట్టాలని జోమాటో తాజా ప్రకటన చేసింది. జోమాటో రూ. 9,375 కోట్లను సమీకరించాలని భావిస్తోంది . జోమాటో షేర్ల తాజా ఇష్యూ రూ. 72 నుంచి 76 చొప్పున ఉండనున్నట్లు తెలుస్తోంది జోమాటో స్థానిక కిరాణా రిటైలర్లను భాగస్వామిగా చేసుకునే విషయంపై సందిగ్ధత నెలకొంది. జోమాటో ఈ నెల ప్రారంభంలో ఆన్లైన్ కిరాణా డెలివరీ ప్లాట్ఫామ్ గ్రోఫర్స్లో 10 శాతం మైనారిటీ వాటాను సొంతం చేసుకోవాలని ఆశించింది. గ్రోఫర్స్లో 100 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 747 కోట్లు) వాటాను జోమాటో ప్రకటించింది.
గ్రోఫర్స్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ, జోమాటో తన సొంత ప్రణాళికలతో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభిస్తోందని జోమాటో సిఎఫ్ఓ అక్షంత్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. కిరాణా డెలివరీలలో జోమాటో తిరిగి రావడం తన సమీప ప్రత్యర్థి స్విగ్గీకి కఠినమైన పోటీని ఇవ్వగలదు, స్విగ్గీ కూడా ఇన్స్టామార్ట్తో డెలివరీ సేవలను అందిస్తోంది. అంతేకాకుంగా బిగ్ బాస్కెట్ వంటి గ్రాసరీ సేవలను అందించే సంస్థలకు జోమాటో పోటీగా నిలవనుంది. కాగా బిగ్బాస్కెట్ తన వ్యాపారాన్ని మరింత పెంచుకోవడానికి టాటా డిజిటల్ నుంచి సుమారు రూ. 9,500 కోట్లను సమీకరించింది.
కోవిడ్ రాకతో పుంజుకున్న ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ...
కోవిడ్-19 రాకతో వినియోగదారులు ఎక్కువగా ఆన్లైన్ గ్రాసరీ డెలివరీల వైపు మొగ్గుచూపారు. రెడ్సీర్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక ప్రకారం.. భారత్లో ఆన్లైన్ కిరాణా మార్కెట్ 2025 నాటికి స్థూల వస్తువుల విలువ (జిఎమ్వి) 24 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,79,400 కోట్లు) ఉంటుందని అంచనా వేసింది.దేశంలో ఫుడ్ అండ్ గ్రాసరీ వాటాలో ఈ-కామర్స్ ఏడుశాతానికి చేరింది.
జోమాటో కీలక నిర్ణయం..! ఇకపై
Published Thu, Jul 8 2021 5:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గాయంతో ఐపీఎల్ మిగతా మ్యాచ్కు మయాంక్ దూరం
గంజాయి విక్రయదారుడి అరెస్టు
విద్యార్థుల్లో ఆలోచనాశక్తి పెరగాలి
ముమ్మరంగా వాహన తనిఖీలు
ఇద్దరి ప్రాణాలు బలిగొన్న అతివేగం
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
పూరీ కాల్చి.. ఓటు అభ్యర్థించి
ఓటరు చీటీ.. సమాచారం కోసమే
కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు
నేలకొరిగిన విప్లవ కెరటం..
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement