తూకాల్లో మోసాలను సహించం | Sakshi
Sakshi News home page

తూకాల్లో మోసాలను సహించం

Published Sat, Jun 3 2023 1:36 AM

ర్యాంప్‌ను పరిశీలిస్తున్న డీడీ మధుసూదన్‌రెడ్డి - Sakshi

బంగారుపాళెం: ర్యాంప్‌ నిర్వాహకులు మామిడి తూకాల్లో తేడాలు రాకుండా చూడాలని హార్టీకల్చర్‌ డీడీ మధుసూదర్‌రెడ్డి అన్నారు. శక్రవారం సాయంత్రం బంగారుపాళెం మండలంలోని తిమ్మోజుపల్లె వద్ద ర్యాంప్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిటుబాటు ధర ఇచ్చేలా వ్యవహరించాలన్నారు. కాటాల ద్వారా వేసే తూకాలలో మోసం జరగకుండా గ్రామ కార్యదర్శులు పర్యవేక్షించాలన్నారు. తూకాల్లో మోసాలను సహించిలేదని స్పష్టం చేశారు. లోడింగ్‌ ప్రక్రియలో మామిడి కాయలు దెబ్బతినకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. గ్రామ కార్యదర్శి నూర్‌మహ్మద్‌, ర్యాంప్‌ నిర్వాహకుడు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement