ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దు

Published Fri, Nov 10 2023 5:26 AM

-

చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నికల విధుల్లో అలసత్వం వహి స్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ షణ్మోహన్‌ హెచ్చరించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణయించిన గడువులోపు ఎన్నికల పనులు పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయి నివేదికను ఈఆర్‌వో యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌళిక వసతులను పరిశీలించి నివేదికలను కలెక్టరేట్‌కు పంపాలని సూచించారు. జిల్లాలో 42 వేల అభ్యంతరాలు వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించాలని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పోలీసుల సహాయంతో సీజ్‌ చేయాలని ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ శ్రీనివాసులు, డీఆర్‌వో రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement