ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపట్టింది. వలంటీర్ నుంచి ప్రత్యేక వైద్యుల వరకు శ్రమించి ప్రజలకు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా, వైద్య శిబిరాలను విజయవంతం అన్నిశాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారు.