30న సంకటహర చతుర్థి వ్రతం | Sakshi
Sakshi News home page

30న సంకటహర చతుర్థి వ్రతం

Published Wed, Nov 22 2023 12:36 AM

కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం  - Sakshi

కాణిపాకం(యాదమరి): కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈ నెల 30వ తేదీన సంకటహర చతుర్థి వత్రం నిర్వహించనున్నారు. వ్రతంలో పాల్గొనేందుకు భక్తులు రూ.350 చెల్లించాల్సి ఉంటుంది. మంగళవారం ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈఓ వెంకటేశు మాట్లాడుతూ భక్తులు టికెట్‌ తీసుకుంటే పూజా సామగ్రిని ఆలయ అధికారులు సమకూరుస్తారన్నారు. ఎంతమంది అయినా వ్రతంలో పాల్గొనవచ్చని తెలిపారు. ఈ మేరకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అదే రోజు సాయంత్రం స్వామివారి స్వర్ణరథోత్సవం ఉంటుందని తెలిపారు.

Advertisement
Advertisement