ఎస్పీ రబ్బర్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

ఎస్పీ రబ్బర్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Published Thu, Mar 28 2024 2:00 AM

మంటల్లో ఎస్పీ రబ్బర్‌ ఫ్యాక్టరీ  - Sakshi

గంగాధర నెల్లూరు: మండలంలోని సుందరరాజుపురం సమీపంలో ఉన్న ఎస్పీ రబ్బర్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం మేరకు, బుధవారం మధ్యాహ్నం ఫ్యాక్టరీలోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో నిప్పు పక్కనుండే గడ్డిపై పడి మంటలు వ్యాపించాయి. అక్కడి నుంచి ఫ్యాక్టరీలో సిద్ధంగా ఉన్న టైర్ల పొడి మూటలు, పాతటైర్లు కాలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే స్థానికులు ఫైరింజన్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిత్తూరు ఏడీఎఫ్‌వో కరుణాకర్‌, హెడ్‌ కానిస్టేబుల్స్‌ సురేష్‌, బాబు, కానిస్టేబుల్స్‌ బాలాజీ, సతీష్‌ లు ఫైరింజన్‌తో తరలివచ్చి మంటలను అదుపు చేశారు. అయితే ఎస్పీ రబ్బర్‌ ఫ్యాక్టరీలో జరిగిన నష్టంపై వివరాలు పోలీసులకు, ఫైరింజన్‌ అధికారులకు ఫ్యాక్టరీ యజమాని ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement