Sakshi News home page

జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ 24 ఏళ్ల యువకుడు మృతి.. పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు

Published Thu, Jul 20 2023 2:43 PM

24 Year Old Electrocuted While Running On Treadmill At Delhi Gym - Sakshi

న్యూఢిల్లీ: యువతలో ఆకస్మిక మరణాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు, హార్ట్‌ఎటాక్‌లు.. కారణాలేవైనా నూరేళ్ల జీవితం అనుభవించాల్సిన యంగ్‌స్టర్స్‌.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. అర్ధాంతరంగా ఎంతో ఆరోగ్యంగా ఉండే వారు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది. జిమ్‌లో ట్రెడ్‌మిల్‌పై వ్యాయామం చేస్తుండగా విద్యుద్ఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు.

నగరంలోని రోహిని ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బీటెక్‌ పూర్తి చేసిన 24 ఏళ్ల యువకుడు సాక్షం పృథి.. గురుగ్రామ్‌కు చెందిన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోహిణి సెక్టార్‌ 19లో నివాసముంటున్నాడు. ఇతడు స్థానికంగా సెక్టార్‌ 15లో ఉన్న జిమ్‌ప్లెక్స్‌ ఫిట్‌నెస్‌ జోన్‌లో తరుచుగా వ్యాయామానికి వెళ్తుంటాడు. ఇదే క్రమంలో గత మంగళవారం జిమ్‌కు వెళ్లాడు. 

ఉదయం 7.30 సమయంలో ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటివారు, సిబ్బంది.. యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో విద్యుదాఘాతమే బాధుతుడి మృతికి కారణమని తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. జిమ్‌ మేనేజర్‌ అనుభవ్‌ దుగ్గల్‌ను అరెస్ట్‌ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
చదవండి: యాక్సిడెంట్‌ను చూడబోతే.. 9 మంది మృతి

Advertisement
Advertisement