సడెన్‌గా కారు‌ టైరు పేలింది.. ఏడుగురు మృతి | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు‌ టైరు పేలి

Published Wed, Feb 24 2021 12:38 PM

7 People Assassinated In Road Accident In Yamuna Express Highway In Uttar Pradesh - Sakshi

లక్నో :  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మధుర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కారు, ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో  ఏడుగురు మృత్యువాతపడ్డారు. హర్యానాకు చెందిన మనోజ్‌, బబితా, అభయ్‌, హేమంత్‌, ఖన్ను, హిమాద్రి, రాకేష్‌లు కారులో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు బయలుదేరారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో కారు యమునా ఎక్స్‌ప్రెస్‌ హైవేపై వెళుతోంది. ఈ నేపథ్యంలో కారు టైరు పేలి నోయిడానుంచి ఆగ్రా వైపు వెళుతున్న ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొట్టింది.

దీంతో కారు నుజ్జునుజ్జయి అందులోని ఏడుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్‌ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు.

చదవండి : ( పని మనిషిని దారుణంగా చంపిన భారత మహిళ )

Advertisement

తప్పక చదవండి

Advertisement