అత్యాశకు పోయి అడ్డంగా బుక్కైన సీఐ | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

Published Sat, Oct 31 2020 5:24 PM

Bodhan CI Nabbed By ACB For Taking Bribe - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఓ భూవివాదంలో లంచం తీసుకుంటూ బోధన్‌ పట్టణ సీఐ, కానిస్టేబుల్‌ అడ్డంగా బుక్కయ్యారు. సీఐ పల్లె రాకేష్, కానిస్టేబుల్ గజేంద్రలు ఓ భూవివాదంలో రూ. 50 వేలు, ఓ బైకు, రూ.లక్షకు పైగా విలువల చేసే ఫోన్‌ను లంచంగా తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు చిక్కారు. సాజిద్‌ అనే వ్యక్తి నుంచి ఈ లంచాన్ని డిమాండ్‌ చేశారు. సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు..మాటు వేసి సీఐ పల్లె రాకేష్‌ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కానిస్టేబుల్‌ గజేంద్ర ద్వారా సీఐ లంచం తెప్పించుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement