భర్త ఫోన్‌ మాట్లాడలేదని.. నవవధువు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భర్త ఫోన్‌ మాట్లాడలేదని.. నవవధువు ఆత్మహత్య

Published Tue, Aug 11 2020 7:40 AM

Bride Committed Suicide In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై‌: భర్త సెల్‌ఫోన్‌లో మాట్లాడలేదని అలిగిన నవ వధువు ఉరివేసుకుంటానని బెదిరించి ప్రాణం తీసుకున్న ఘటన తిరువళ్లూరు సమీపంలో జరిగింది. తిరువళ్లూర్‌ సమీపంలోని చెవ్వైపేట కందన్‌ కొట్టై గ్రామానికి చెందిన హరిబాబుకు, షర్మిల (29)కు మూడు నెలల క్రితం పెళ్లి జరిగింది. హరిబాబు పని కోసం కాంచీపురం వెళ్లాడు. సాయంత్రం షర్మిల భర్త సెల్‌ ఫోన్‌కు కాల్‌ చేసింది. అతను మాట్లాడలేదు. (అమానుషం: భార్యకు కరోనా అని తెలిసి..

హరిబాబు ఇంటికి తిరిగి రాగానే దీని గురించి అడిగి షర్మిల అలిగింది. అతన్ని బెదిరించేందుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఒక గదిలో పెట్టి తాళం వేసింది. తర్వాత ఆమె పడక గదికి వెళ్లి ఉరివేసుకుంది. గొంతుకు తాడు బిగుసుకోవడంతో మృతి చెందింది. హరిబాబు కేకలు విని స్థానికులు అక్కడికి చేరుకుని చూడగా షర్మిల ఉరికి శవంగా వేలాడుతూ కనిపించింది. చెవ్వై పేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   (భార్య ఊరికి వెళ్లగానే ఇంటికి పిలిపించుకుని..)

Advertisement
Advertisement