CID Investigation To Cherukuri Sailaja Kiran On Margadarsi Chit Fund Case - Sakshi
Sakshi News home page

‘మార్గదర్శి’ కేసులో ఏ–2 శైలజ విచారణ నేడు

Published Thu, Apr 6 2023 6:25 AM

CID investigation to Cherukuri Sailaja Kiran On Margadarsi Case - Sakshi

సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమ వ్యవహారాల కేసులో ఏ–2గా ఉన్న ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చెరుకూరి శైలజ కిరణ్‌ను సీఐడీ అధికారులు గురువారం విచారించనున్నారు. కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టం–­1982కు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మ్యూచువల్‌ఫండ్స్, షేర్‌ మార్కెట్లో పెట్టు­బడిగా పెట్టడం, రిజర్వ్‌ బ్యాంకు నిబంధన­లకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణపై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ కేసులో ఏ–3గా ఉన్న కొందరు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచి మేనే­జర్లను సీఐడీ విభాగం అరెస్ట్‌ చేసింది. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావును సీఐడీ అధికారులు సోమవారం విచారించారు. నిధుల మళ్లింపు వాస్తవమేనని ఆయన అంగీకరించడం ప్రాధా­న్యం సంతరించుకుంది.

పైగా అది తమ సంస్థ ఇష్టమని.. అసలు విచారించడానికి సీఐడీకి ఏం అధికారం ఉందన్న రీతిలో రామోజీరావు ప్రవ­ర్తించడం అందర్నీ విస్మయపరచింది. కానీ సీఐడీ అధికారులు నిబంధనల మేరకు ఆయనను విచారించి కీలక విషయాలు రాబ­ట్టారు. ఏ–1గా ఉన్న రామోజీరావే నిధుల మళ్లింపు నిజమేనని దాదాపుగా అంగీకరించ­డంతో ఈ కేసులో సీఐడీ కీలక పురోగతి సాధించినట్లయింది.

ఈ నేపథ్యంలోనే ఈ కేసులో ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజ కిరణ్‌ను గురు­వారం విచారించనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శైలజను హైదరాబాద్‌ జూబ్లీ­హిల్స్‌­లోని ఆమె నివాసంలోనే విచారించను­న్నారు. రామోజీరావు, శైలజ స్టేట్‌మెంట్లను విశ్లేషించిన అనంతరం ఈ కేసులో తదుపరి చర్యలకు ఉపక్రమించాలని సీఐడీ భావిస్తోంది. వారిద్దరినీ ఆంధ్రప్రదేశ్‌కు పిలిపించి మరీ విచారించేందుకు సీఐడీ సంసిద్ధమవుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.   

Advertisement
Advertisement