Sakshi News home page

Delhi: కారును ఢీకొట్టిన ట్రక్కు.. సీఐ దుర్మరణం.. ప్రమాదమా? హత్యా?

Published Sun, Jul 30 2023 4:45 PM

Delhi: Inspector Killed After Truck Rams His Car On Rohtak Road - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ట్రక్కు ఢీకొట్టిన దుర్ఘఘనలో ఓ పోలీస్‌ ఇనస్పెక్టర్‌ మృత్యువాతపడ్డాడు. మదిపూర్‌  మెట్రో స్టేషన్‌ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం వెలుగుచూసింది. వివరాలు.. ఢిల్లీ పోలీస్‌ విభాగానికి చెందిన సీఐ జగ్బీర్‌ సింగ్‌ ప్రయాణిస్తున్న కారు సాంకేతిక సమస్యతో రోహ్‌తక్‌ రోడ్డుపై ఆగిపోయింది.

దీంతో కారు దిగి ఆయన పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగ్బీర్‌ సింగ్‌ అక్కడికక్కడే మరణించాడు.

ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్‌ అక్కడి నుంచి నిలిపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే హత్య కుట్రతో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కాశ్మీర్‌లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం

Advertisement

తప్పక చదవండి

Advertisement