చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో మాదకద్రవ్యాలు సరఫరా, వినియోగిస్తున్న ముఠాను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 34 గ్రాముల బరువున్న మిథైలెనెడియోక్సీ–మెంథాఫేటమైన్ (ఎండీఎంఏ) అనే డ్రగ్స్ను సీజ్ చేసిన పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో సూడాన్ దేశానికి చెందిన అహమ్మద్ ఒమర్ (28)తో పాటు చిత్తూరుకు చెందిన కె.సిరాజ్ (37), కె.సురేష్ (25), ఎస్.జయశంకర్ (32), సి.ప్రతాప్ (26), ఎస్.తేజకుమార్ (22) అనే యువకులున్నారు.
చిత్తూరు ఎస్పీ వై.రిషాంత్రెడ్డి సోమవారం వివరాలు వెల్లడించారు. ఆదివారం నగరంలోని ఇరువారం–యాదమరి కూడలి వద్ద కొంతమంది వ్యక్తులు స్ఫటికల రూపంలో ఉన్న పదార్థాన్ని విక్రయించడం, కొనుగోలు చేస్తుండటాన్ని గుర్తించిన టూటౌన్ ఎస్ఐలు మల్లికార్జున, లోకేశ్ తమ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. ముగ్గురు వ్యక్తులు పారిపోగా, ఆ ప్రదేశంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
సూడాన్ దేశంలోని ఖార్టోమ్ సిటీకు చెందిన అహమ్మద్ ఒమర్ అనే వ్యక్తితో చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం అరగొండకు చెందిన కె.సిరాజ్ ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ బెంగళూరులో ఒమర్తో స్నేహం చేసేవాడు.
అతని వద్దనుంచి ఎండీఎంఏ అనే మాదకద్రవ్యాన్ని కొనుగోలుచేసి, దాన్ని చిత్తూరు నగరానికి చెందిన సురేష్, జయశంకర్, ప్రతాప్, తేజ, వెంకటేష్, మోహన్, మురళి అనే యువకులకు విక్రయించేవాడు.కాగా, పోలీసులు రూ.2 లక్షల విలువజేసే 34 గ్రాముల మాదకద్రవ్యం, 20 సిరంజీలు, మూడు సెల్ఫోన్లు, ఒమర్ పాస్పోర్టు, వీసాను సీజ్ చేశారు.
మాదకద్రవ్యాల ముఠా అరెస్టు
Published Tue, Nov 8 2022 5:49 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
● సాయంత్రం నుంచి రథాలకు బ్రేక్.. మూగబోనున్న మైక్లు ● మద్యం దుకాణాలకూ సీల్ ● చివరిరోజుపై పార్టీల ఫోకస్
బీజేపీ గెలిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమే
No Headline
విద్యుదాఘాతంతో దుక్కిటెద్దు మృతి
మోదీని మూడోసారి ప్రధాని చేయాలి
బీజేపీకి ఓటమి భయం
క్లుప్తంగా
గాలివాన బీభత్సం
కల్యాణం.. కమనీయం
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement