వివాహేతర సంబంధం, మటన్‌ వ్యాపారి హత్య | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం, మటన్‌ వ్యాపారి హత్య

Published Sun, Nov 22 2020 2:37 PM

Extra Marital Affair: Mutton Vendor Eliminated In Karimnagar

సాక్షి, కరీంనగర్‌: వివాహేతర సంబంధం ఓ మనిషి ప్రాణాలను బలిగొంది. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ శివారులో మటన్ వ్యాపారి ఎండీ వలీంపాషా ఆదివారం దారుణంగా హత్యకు గురయ్యాడు. తోటి వ్యాపారి సయ్యద్ అప్జల్ తల్వార్‌తో వలీంపాషాపై దాడికి పాల్పడ్డాడు. మెడపై తల్వార్‌తో దాడి చేయడంతో వలీంపాషా కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు నగరంలోని హుస్సేన్ పురకు చెందిన వ్యక్తి. 

అదే ప్రాంతానికి చెందిన ఆప్జల్ భార్యతో వలీంపాషాకు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానంతో దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. హత్యకు పాల్పడిన అప్జల్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులు మాత్రం అతని అరెస్టును అధికారికంగా ధ్రువీకరించలేదు. సంఘటనా స్థలాన్ని ట్రైనీ ఐపీఎస్ రేష్మా పెరుమాళ్, ఏసిపి విజయసారథి సందర్శించి విచారణ చేపట్టారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Advertisement
Advertisement