వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి.. | Sakshi
Sakshi News home page

Extra Marital Affair: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి..

Published Thu, Feb 3 2022 4:42 PM

Extra Marital Affair: Wife Assassinated Husband With Lover In Nalgonda - Sakshi

సాక్షి, నల్లగొండ: వివాహేతర సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడనే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటనలో భార్యతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు పట్టణ టూటౌన్‌ పోలీసులు. ఈ కేసు వివరాలను బుధవారం పట్టణంలోని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. పానగల్‌కు చెందిన ఇరగదిండ్ల వెంకన్న(41) వ్యవసాయ బావుల తవ్వకం పనులు చేస్తూ, భార్య సుజాత కూలి మెస్త్రిగా చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్య సుజాత కూలి పనులకు వెళ్లిన క్రమంలో నార్కెట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టుకు చెందిన కప్ప లింగస్వామితో అక్రమ సంబంధం ఏర్పడింది.
చదవండి: స్కూల్‌ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి 

ఈ బంధం కాస్త బలపడడంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పథకం రచించింది. ఇందులో భాగంగా సుజాత జనవరి 29న రాత్రి ప్రియుడు లింగస్వామికి ఫోన్‌ చేసి తన భర్త మద్యం తాగి నిద్రపోయాడని హత్యకు ఇదే సరైన సమయమని ప్రియుడికి తెలిపింది. దీంతో లింగస్వామి అతడి స్నేహితుడైన నార్కెట్‌పల్లి మండలంలోని గుమ్మళ్లబావికి చెందిన చెన్నకేశవరెడ్డి, చెర్వుగట్టుకు చెందిన శ్రీకాంత్‌తో బైక్‌పై పట్టణానికి వచ్చారు. శ్రీకాంత్‌ లింగస్వామిని దించి వెళ్లిపోయాడు. చెన్నకేశవరెడ్డి, లింగస్వామి ఓ మెడికల్‌ షాపులో చేతిగ్లౌజ్‌లు కొనుగోలు చేసి రాత్రి పానగల్‌ కట్టపై వేచి ఉన్నారు. దీంతో సుజాత అర్థరాత్రి తర్వాత ప్రియుడు లింగస్వామికి వాట్సాప్‌ కాల్‌ చేసి రమ్మని చెప్పింది. ఇంటికి వెళ్లిన ప్రియుడు లింగస్వామి వెంకన్న మొఖంపై దిండ్డుతో, గొంతుపై అదిమి పట్టగా భార్య కాళ్లను పట్టుకుని హత్య చేశారు.
చదవండి: Viral Video: పట్టపగలే భారీ దొంగతనం.. తుపాకీతో బెదిరించి..

వెంట వచ్చిన చెన్నకేశవరెడ్డి ఇంటికి సమీపంలో ఉన్నాడు. సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తండ్రి భిక్షమయ్య ఫిర్యాదుతో పోలీస్‌లు సుజాతను తనదైన శైలిలో విచారించగా అసలు నిజం ఒప్పుకుంది. మృతుడు వెంకన్నకు గుండాల మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన సుజాతతో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. హత్యకు సహకరించిన వారిని, ప్రియుడు, భార్య సుజాతను గతంలో హత్య చేయాలని ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.  

Advertisement
Advertisement