కుమారుడికి కరోనా రావడంతో.. | Sakshi
Sakshi News home page

కాలువలో దూకి తండ్రి ఆత్మహత్యాయత్నం

Published Fri, Jul 31 2020 10:35 AM

Father Suicide Attempted In Krishna District - Sakshi

సాక్షి, విజయవాడ: కుమారుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఓ తండ్రి తీవ్ర మనస్తాపం చెందాడు. గుండె చెదిరిన ఆ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. బాధితుడు మచిలీపట్నానికి చెందిన నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. తన కుమారుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కాల్వలోకి దూకడంతో కొట్టుకుపోతున్న నాగేశ్వరరావును ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రక్షించారు.ఆయనను పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement