ఒంగోలు/కలిగిరి: సహజీవనం చేస్తున్న మహిళపై అనుమానం పెంచుకున్నాడు. ఆ ఇద్దరిమధ్యా తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆ మహిళ తన సోదరుడి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబంపై కత్తిదూసిన హంతకుడు ఆమె సోదరుడి భార్యను, కుమారుడిని పట్టపగలే చంపేశాడు. అక్కడి నుంచి ఒంగోలు చేరుకుని తాను సహజీవనం చేసిన మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో కత్తితో మరో వ్యక్తి గొంతు కోసే క్రమంలో పోలీసులకు పట్టుబడ్డాడు. శనివారం చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అంబటివారిపాలేనికి చెందిన నూర్జహాన్కు నెల్లూరుకు చెందిన వ్యక్తితో వివాహమైంది. కొంతకాలానికి భర్తతో విడిపోయింది. కాగా, కలిగిరి మండలం పోలంపాడుకు చెందిన సమీప బంధువు షేక్ రబ్బానీ సోదరితో నూర్జహాన్ సోదరుడికి వివాహమైంది. ఆ తర్వాత నూర్జహాన్, అవివాహితుడైన రబ్బానీ మధ్య సాన్నిహిత్యం పెరిగి ఇద్దరూ ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వీరిద్దరికి ఓ కుమారుడు. వయసు ఇప్పుడు ఆరేళ్లు.
అనుమానం పెనుభూతమై..
రబ్బానీ ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో టీ దుకాణం నిర్వహిస్తూ నూర్జహాన్, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. రబ్బానీ స్థానిక సత్యన్నారాయణపురానికి చెందిన మండ్ల కాశీకుమార్ అనే యువకుడిని తన టీ దుకాణంలో పనిలో పెట్టుకున్నాడు. కాగా, నూర్జహాన్తో కాశీకుమార్ చనువుగా ఉండటంతో వారిద్దరిపైనా అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై రబ్బానీ, నూర్జహాన్ మధ్య విభేదాలొచ్చాయి. దీంతో నూర్జహాన్ అంబటివారిపాలెంలోని తన మరో సోదరుడు మస్తాన్ ఇంట్లో ఉంటోంది. నూర్జహాన్ను తన నుంచి దూరం చేసేందుకే కనిపించకుండా చేశారని భావించిన రబ్బానీ.. మస్తాన్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. అంబటివారిపాలెంలోని మస్తాన్ ఇంటికి శనివారం చేరుకున్నాడు. ఆ సమయంలో మస్తాన్ నెల్లూరు వెళ్లగా.. మస్తాన్ భార్య మీరమ్మ (45)తో గొడవపడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మీరమ్మ మెడపై నరికాడు. తల్లిపై దాడిని అడ్డుకోబోయిన ఆమె కుమారుడు అక్బర్ ఆలీఫ్ (23)ని పొడిచాడు. తల్లీకుమారులు అక్కడికక్కడే మృతిచెందారు.
మరో హత్య చేయబోయి..
అనంతరం రబ్బానీ మోటార్ సైకిల్పై ఒంగోలు చేరుకున్నాడు. తన టీ దుకాణంలో పనిచేసిన మండ్ల కాశీకుమార్పై మంగమ్మ కాలేజీ జంక్షన్ సమీపంలో దాడిచేసి కత్తితో గొంతు కోశాడు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ హుటాహుటిన అక్కడకు చేరుకుని రబ్బానీని అదుపులోకి తీసుకుని తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన కాశీకుమార్ను రిమ్స్కు తరలించారు. తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నూర్జహాన్ను ఆరు నెలలుగా కాశీకుమార్ నెల్లూరులో దాచి అక్కడకు వెళ్లి వస్తున్నాడని, వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అందుకే కడతేర్చేందుకు యత్నించినట్లు పేర్కొన్నాడు. నూర్జహాన్ ఎక్కడ ఉందనేది తెలిసినా మీరమ్మ చెప్పనందునే ఆమెను, అడ్డువచ్చిన ఆమె బిడ్డనూ చంపేసినట్లు పోలీసులతో చెప్పినట్టు తెలిసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సహజీవనం చేస్తున్న మహిళపై.. ఇద్దర్ని హతమార్చి.. మరొకర్ని చంపబోతూ
Published Sun, Jan 23 2022 4:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement