విషాదం: బాణసంచా కాల్చడంపై ఘర్షణ.. ఒకరు మృతి | Sakshi
Sakshi News home page

విషాదం: బాణసంచా కాల్చడంపై ఘర్షణ.. ఒకరు మృతి

Published Fri, Nov 5 2021 9:25 AM

UP Man Killed After Two Groups Clash Over Bursting Firecrackers - Sakshi

లక్నో: దీపావళి రోజు విషాదం చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. షామ్లీ జిల్లాలో గురువారం దీపావళి రోజు టపాసులు కాల్చడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. 
చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు

ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని రాహుల్‌, సంజీవ్‌ సైనీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొదుతూ సంజీవ్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. 

Advertisement
Advertisement