సాక్షి, మంచిర్యాల/ మంచిర్యాల క్రైం: మొబైల్ లోన్ యాప్ సంస్థ వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఆమె చనిపోయిన తరవాత కూడా పదేపదే కాల్స్ చేస్తూ, ఆమె మృతదేహం ఫొటోలు చూపించాలని యాప్ నిర్వాహకులు ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ దారుణం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని గోపాల్వాడకు చెందిన వివాహిత బొల్లు కళ్యాణి(30) ‘హలో రూపీ లోన్’యాప్ ద్వారా రూ.5 వేల రుణం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపూర్కు చెందిన ఆమె భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే 20 రోజుల క్రితం ఆమె మంచిర్యాలకు వచ్చింది. అప్పటి నుంచి లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువకావడంతో ఇటీవల రెండు దఫాలుగా రూ.20 వేలు చెల్లించింది. అయినా ఆ చెల్లింపు వివరాలు అప్డేట్ కాలేదంటూ పదేపదే ఆమెను వేధించసాగారు. వేర్వేరు నంబర్లతో రోజుకు వందల సార్లు ఆమెకు కాల్స్చేస్తూ అసభ్య పదజాలంతో దూషించేవారు.
ఫోన్కాల్ వస్తోందంటే వణికిపోయి..
కాల్స్ మాట్లాడాలంటే భయంతో వణికిపోయిన కళ్యాణి కొన్నిసార్లు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో వాట్సాప్లో ఆమె ముఖాన్ని న్యూడ్ ఫొటోలతో మార్ఫింగ్ చేసి ఆమెకే పంపి, వీటిని అందరికీ షేర్ చేస్తామని బెదిరించేవారు. దీంతో భయాందోళన చెందిన కళ్యాణి ఈ నెల 16న హెయిర్ డై తాగి ఆత్మహత్యకు యత్నించింది. రెండ్రోజులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది 17న సాయంత్రం డిశ్చార్జి అయింది. మళ్లీ అదే తీరుగా యాప్ నిర్వాహకుల వేధించడం మొదలుపెట్టారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇబ్బంది పెట్టొదని బతిమిలాడినా వారు వినిపించుకోలేదు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి బుధవారం ఇంట్లోని బాత్రూమ్లోని షవర్కు శాలువాతో ఉరేసుకుంది. మరోవైపు ఆమె చనిపోయిందనే విషయాన్ని నమ్మకుండా యాప్ నిర్వాహకులు పదేపదే కాల్స్ చేశారు. కనికరం లేకుండా ఆమె మృతదేహం ఫొటోలు పంపాలంటూ కుటుంబసభ్యులను ఒత్తిడి చేశారు. అయితే భర్త, అత్తింటివారు తమ కూతురిని డబ్బుల కోసం వేధించడంతోనే యాప్ లోన్ తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, హలో రూపీ లోన్ యాప్తో పాటు మరో ఐదారు యాప్ల నుంచి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు.
మంచిర్యాల: లోన్ యాప్లో కీచకుడు.. మార్ఫింగ్ ఫొటోలతో వివాహిత ఆత్మహత్య
Published Wed, May 18 2022 6:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకప్పుడు ఎన్నో కష్టాలు.. పాన్ ఇండియా హీరో అయ్యాడు!
వేసవిలో నెయ్యిని తీసుకుంటే బోలెడన్ని లాభాలు!
టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు
HBD Pat Cummins: సన్రైజర్స్ కెప్టెన్ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారు: లక్ష్మీ పార్వతి
ఉద్యోగుల తొలగింపు..టీసీఎస్లో అసలేం జరుగుతోంది?
టీడీపీ నేతల రౌడీయిజం.. పిన్నెల్లి భార్యకు గాయాలు
Haryana: మైనార్టీలో బీజేపీ! మాజీ సీఎం కీలక వ్యాఖ్యలు
పాక్ను ఓడించగానే రాత్రంతా సంబరాలు: రషీద్ ఖాన్
తప్పక చదవండి
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ఏనుగుల దాడిలో వీడియో జర్నలిస్టు మృతి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- తెలుగులో డైరెక్ట్గా ఓటీటీలోకి వస్తున్న మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement