పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు | Sakshi
Sakshi News home page

పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు

Published Thu, Mar 25 2021 11:59 AM

Police Case Filed On TDP Leader Paritala Sriram In anantapur - Sakshi

సాక్షి, అనంతపురం: రాప్తాడు టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ్‌తో సహా తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముష్టికోవెల గ్రామంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకట్రాముడుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎందుకు మద్దతు ఇచ్చావంటూ పరిటాల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
చదవండి:  నిమ్మగడ్డది అప్పుడో మాట.. ఇప్పుడో మాట

Advertisement
Advertisement