ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో.. | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మూలమలుపు.. మట్టి లారీ బైక్‌ను ఢీకొట్టడంతో..

Published Sat, Apr 6 2024 7:41 AM

Three People Dead In Karimnagar Road Accident - Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హుజూరాబాద్‌ మండలంలో ఓ లారీ.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెతో సహా మరో యువతి మృతిచెందింది. దీంతో, కుటుంబం సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

వివరాల ప్రకారం.. హుజూరాబాద్‌ మండలం బోర్నపల్లి మూలమలుపు వద్ద మొరం లోడ్‌తో వస్తున్న లారీ.. బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీలో ఉన్న మొరం బైక్‌పై వెళ్లున్న వారిపై పడింది. మట్టిలో వారు ముగ్గురు కూరుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం, జేసీబీ సాయంతో వారి మృతదేహాలను బయటకు తీశారు. 

ఇక, ఈ ఘటనలో మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెలు ఉన్నారు. మృతి చెందిన వారిని విజయ్‌, సింధుజ, వర్షలుగా గుర్తించారు. దీంతో, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కాగా, బోర్నవల్లిలో పెద్దమ్మ తల్లి బోనాల జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

Advertisement
Advertisement