జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని... | Sakshi
Sakshi News home page

జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని...

Published Mon, Nov 13 2023 11:38 PM

తన ప్రచార ఆటోతో జయకుమార్‌ 
 - Sakshi

అమలాపురం చేరుకున్న ప్రజా చైతన్య యాత్ర

అమలాపురం టౌన్‌: జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని... 175 అసెంబ్లీ స్థానాల్లో విజయయం సాధించాలని కాంక్షిస్తూ ప్రకాశం జిల్లా ఈదుమూది గ్రామానికి చెందిన కావూరి జయకుమార్‌ చేపట్టిన 100 రోజుల ప్రజా చైతన్యయాత్ర అమలాపురానికి సోమవారం చేరుకుంది. ఆటోలో ఈ యాత్రను నిర్వహిస్తున్న జయకుమార్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్‌ 12న ఇడుపులపాయలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర 63వ రోజు అమలాపురం చేరుకుందని చెప్పారు. అమలాపురంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను కలిసి మాట్లాడారు. జయకుమార్‌ చేపట్టిన యాత్ర పట్ల మంత్రి విశ్వరూప్‌ సంతోషం వ్యక్తం చేశారు. 100 రోజులు నిర్వహించే ఈ యాత్ర ఇప్పటి వరకూ 16 జిల్లాల్లో సాగిందని తెలిపారు. ఈ యాత్రను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజైన డిసెంబర్‌ 21వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో నిర్మితమైన జగనన్న సంకల్ప పాదయాత్ర విజయ స్థూపం వద్ద ముగిస్తానని జయకుమార్‌ చెప్పారు.

Advertisement
Advertisement